
అలాగే మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ సినిమాలు రూపొందించి.. సంచలన దర్శకునిగా నిలిచారు వినాయక్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు అంబరాన్ని తాకుతాయనడంలో సందేహమే లేదు. ఈ అపూర్వ కలయికకు నిర్మాత డి.వి.వి.దానయ్య శ్రీకారం చుట్టారు. త్వరలో వీరిద్దరి కలయికలో ఆయన ఓ సంచలన చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.
మరో విశేషం ఏంటంటే.. ఇందులో పవన్కళ్యాణ్కు జోడీగా �ఏంమాయ చేసావె� ఫేం సమంత నటించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో పవర్స్టార్ చేయనున్నారని, బద్రి, ఖుషి, జల్సా తరహాలో సరదాగా సాగిపోయే కథాంశమిదని, ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది. మిగిలిన వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

No comments:
Post a Comment